YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయోధ్యకు కోనసీమ కొబ్బరి బొండాలు

అయోధ్యకు కోనసీమ కొబ్బరి బొండాలు

మండపేట
ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరగనున్న రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా   మండపేట నుంచి అలంకరించిన కొబ్బరి బొండాలను తీసుకువెళ్లారు. మండపేటకు చెందిన కేవీ రామారెడ్డి దంపతులు ఈ కొబ్బరి బొండాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రతి ఏట భద్రాచలం ఒంటిమిట్ట ఇలా చాలా ప్రముఖ ఆలయాల్లో జరిగే కళ్యాణాలకు వీరు చేతుల మీద తయారు చేసిన కళ్యాణ బొండాలను తీసుకువెళ్లి ఇవ్వడం ఆచారంగా వస్తోంది. దీనిలో భాగంగానే అయోధ్య రామ మందిర ప్రతిష్ట కార్యక్రమానికి కూడా వీరు సేకరించిన మూడు బొండాలను శంకు నామ చిత్రాలతో తయారుచేసి అయోధ్యకు తీసుకు వెళ్తున్నారు. అక్కడ ప్రతిష్టా కార్యక్రమంలో ఈ కొబ్బరి బొండాలను ఉపయోగించనున్నారు. రామారెడ్డి దంపతులు అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ కు వీటిని అందిస్తారు.

Related Posts