YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయోధ్యకు శ్రీవారి లడ్డూలు…

అయోధ్యకు శ్రీవారి లడ్డూలు…

తిరుపతి
రామజన్మభూమి అయోధ్యకు శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూలను టీటీడీ తరలించింది. 22వ తేది దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి లక్ష లడ్డూల శనివారం ఉదయం తిరుపతి ఎయిర్పోర్ట్ తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లక్ష లడ్డూలను తయారు చేసి, శుక్రవారం ప్రత్యేకంగా పాకింగ్ చేయించారు . శనివారం  తిరుపతి విమానాశ్రయం నుండి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు  ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు లడ్డూలు  చేరుకున్నాయి. ఈలడ్డూలను . 22వ తేదీన అయోధ్యలో భక్తులకు ప్రసాదంగా పంపిణి చేయనున్నారు.

Related Posts