YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అయోధ్య‌లో కొలువుదీరిన రామ్‌లల్లా..

అయోధ్య‌లో కొలువుదీరిన రామ్‌లల్లా..

అయోధ్య‌ జనవరి 22
కౌస‌ల్య రాముడు.. అయోధ్య‌లో కొలువుదీరాడు. బాలరాముడి విగ్ర‌హాన్ని కొత్త‌గా నిర్మించిన ఆల‌యంలో ప్ర‌తిష్టించారు. ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్ర‌తిష్ట జ‌రిగింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని నిర్మించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్ర‌తువును నిర్వ‌హించారు. కీల‌క‌మైన ఈ 84 సెక‌న్ల స‌మ‌యంలోనే రాముడి మూర్తికి ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. రాముడి విగ్ర‌హం కండ్ల‌కు ఉన్న వ‌స్త్రాన్ని ప్ర‌ధాని తొల‌గించారు. ఆ త‌ర్వాత పుష్పాల‌తో రామున్ని పూజించారు. ప్రాణ ప్ర‌తిష్ట స‌మ‌యంలో 50 శంఖాలు ఊదారు. రామ నామంతో ఆల‌య ప‌రిస‌రాలు మారుమోగాయి. జైజైరాం రాజారాం.. జైజైరాం రాజారాం.. అంటూ రామ‌భ‌క్తులు త‌న్మ‌య‌త్వంలో తేలిపోయారు. గ‌ర్భిగుడి పూజ‌లు ప్ర‌ధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పాల్గొన్నారు.శ్రీ రామ జ‌న్మ‌భూమి రామ‌మందిరంలో ఇవాళ శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. ఉద‌యం రామ్ ల‌ల్లాను మంత్రోచ్ఛ‌ర‌ణ‌తో నిద్ర లేపారు. వైదిక మంత్రాలు మంగ‌ళా సాస‌నం పాడారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు చెందిన పూజ‌లు ప్రారంభం అయ్యాయి. ఒక‌వైపు గ‌ర్భ‌గుడిలో బాల‌రాముడి మూర్తికి పూజ‌లు.. మ‌రో వైపు య‌జ్ఞ‌శాల‌లో హ‌వ‌నం సాగింది. ప్రాణ ప్ర‌తిష్ట ర‌త్వాత శుక్ల య‌జుర్వేదంకు చెందిన హోమం, పారాయ‌ణం జ‌ర‌గ‌నున్న‌ది. ఆ త‌ర్వాత సాయంత్రం పూర్ణాహుతి ఉంటుంది.ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం.. పతీత పావ‌న సీతారం గానం మారుమోగింది. పీతాంబ‌ర వ‌స్త్రాల్లో బాల‌రాముడు మ‌నోహ‌రంగా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు.

శతాబ్దాల నెరవేరిన హిందువుల కల రామమందిర ప్రస్థానంలో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు..
శతాబ్దాల హిందువుల కల నెరవేరింది.ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాల తర్వాత ఇది సాకారమైంది. ఈ నేపథ్యంలో రామమందిర ప్రస్థానంలో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు..
1528: రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ వద్ద పనిచేసే జనరల్‌ మీర్‌ బాఖి ఒక మసీదును నిర్మించాడనే వాదనలు ఉన్నాయి.
1853: బాబ్రీ మసీదు విషయంలో బ్రిటిష్‌ కాలంలో మొదటిసారిగా 1853లో హింస చెలరేగింది. 1859లో వివాద స్థలాన్ని బ్రిటిషర్లు రెండుగా విభజించి, కంచె వేశారు.
1949: బాబ్రీ మసీదు లోపల కొందరు రాముడి విగ్రహాలను ప్రతిష్ఠించారు.
1950: రాముడికి పూజలు చేసేందుకు అనుమతించాలని హిందువుల తరపున గోపాల్‌ సింగ్‌ విశారద్‌, మసీదులో విగ్రహాలను తొలగించాలని హసీం అన్సారీ ఫైజాబాద్‌ కోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి తాళాలు వేసింది.
1980: శ్రీరామ జన్మభూమికి విముక్తి కలిగించి, ఆలయాన్ని నిర్మించాలన్న డిమాండ్‌తో వీహెచ్‌పీ నేతృత్వంలోని ఓ కమిటీ ఉద్యమం ప్రారంభించింది.
1990: రామాలయ నిర్మాణానికి మద్దతుగా బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ నుంచి యూపీలోని అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు.
1992: డిసెంబర్‌ 6న వేలాది మంది కర సేవకులు, వీహెచ్‌పీ కార్యకర్తలు వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇది దేశంలో మత ఉద్రిక్తతలకు దారితీసింది.
2003: వివాదాస్పద స్థలంలో ఏఎస్‌ఐ సర్వే చేపట్టింది. మసీదు నిర్మాణం కింద ఒక హిందూ నిర్మాణం ఉండేదని నివేదించింది. దీన్ని ముస్లింలు వ్యతిరేకించారు.
2010: విస్తృత విచారణ చేసిన అలహాబాద్‌ హైకోర్టు.. ఆ భూమిని మూడు భాగాలుగా చేసి, రామ్‌లల్లా, ఇస్లామిక్‌ వక్ఫ్‌ బోర్డ్‌, నిర్మొహి అఖారాలకు కేటాయించింది.
2011: మూడు పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
2019: సుప్రీంకోర్టు ఈ కేసును మధ్యవర్తిత్వం కోసం సిఫారసు చేసింది. మధ్యవర్తితంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ. రోజువారీ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 2019, ఆగస్టు 16న తీర్పు రిజర్వ్‌ చేసింది.
2019, నవంబర్‌ 9: సుప్రీంకోర్టు రామ్‌లల్లాకు అనుకూలంగా తీర్పునిస్తూ వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని కేంద్రం ఏర్పాటు చేసిన ట్రస్టుకు అప్పగించింది. మసీదు నిర్మాణానికి మరోచోట 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది.
2020: రామ్‌లల్లా విగ్రహాన్ని టెంట్‌ నుంచి తాత్కాలిక ఆలయానికి తరలింపు. 2020, ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన.
2024, జనవరి 22: దాదాపు నాలుగేండ్లపాటు సాగిన నిర్మాణం తర్వాత.. దేశంలోని హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జనవరి 22న జరగబోతున్నది.

Related Posts