YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బొత్సాకు బాగోలేదా

బొత్సాకు బాగోలేదా

విజయనగరం, జనవరి 22 
మంత్రి బొత్స సత్యనారాయణ కంచుకోట చీపురుపల్లిలో ఎదురీదుతున్నారు. ఆయన ఇతర మండలాల్లో వెనుక బడినా మొరకముడిదాం అనే మండలంలో భారీ మెజార్టీ వస్తుంది. ఈ కారణంగా ఆయన స్వల్ప తేడాతో అయినా బయటపడుతూ వస్తున్నారు. కానీ ఈ సారి ఆ మొరకముడిదాం మొత్తం ఈ సారి బొత్సకు మూడిందన్న సంకేతాలు పంపుతోంది. పార్టీ క్యాడర్ అంతా గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు. వారిని ఆపేందుకు బొత్స మేనల్లుడు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. వారం రోజుల కిందట మండలంలో మేజర్ పంచాయతీ అయిన సోమలింగాపురం వైసీపీ నేతలంతా టీడీపీలో చేరిపోయారు. గురువారం చంద్రబాబు సమక్షంలో కోట్ల సుగుణాకర్ రావు అనే నేతతో పాటు మాజీ ఎణ్మెల్యే గద్దె బాబూరావు కూడా టీడీపీలో చేరారు. సుగుణాకర్ రావు పార్టీ మారడం బొత్సకు పెద్ద దెబ్బని భావిస్తున్నారు. ఆయనను ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. బొత్సకు ఏకపక్షంగా ఓట్లేసే గ్రామాల్లో ఇప్పుడు రెండు వర్గాలయ్యాయి. మరో వైపు టీడీపీ తరపున యువ నాయకుడు కిమిడి నాగార్జున సామాన్యుల్లో సామాన్యుడిగా తిరుగుతున్నారు. ప్రతీ గ్రామానికి వెళ్తున్నారు. అందర్నీ పలకరిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటున్న ఆయన రాజకీయాల కోసం అన్నీ వదిలేసి వచ్చారు. ప్రభుత్వ నిర్వాకాలపై పోరాడుతున్నారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున. గత ఎన్నికల్లో చివరి క్షణంలో టిక్కెట్ దక్కించుకుని పోటీ చేశారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణకు...నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఝలక్ ఇస్తున్నారు. అధికార పార్టీకి గుడ్ బై చెప్పి... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పేసుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ గెలుపులో కీలకంగా ఉన్న మెరకముడిదాం మండలంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.  చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, కోట్ల సుగుణాకరరావు  తీర్థం పుచ్చుకున్నారు.  గద్దే బాబురావు... 1994,1999లో చీపురుపల్లి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.అటు కోట్ల సుగుణాకరావు...విజయనగరం జిల్లా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకుడిగా పనిచేశారు. ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. సుగుణాకరరావు తండ్రి కోట్ల సన్యాసి అప్పలనాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 ఎన్నికల్లో సన్యాసి అప్పలనాయుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. కోట్ల సుగుణాకరరావు కుటుంబానికి చెందిన వ్యక్తులే మెరకముడిదాం మండల జడ్పీటీసీ సభ్యులుగా, మండలాధ్యక్షులుగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో...చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పలు పంచాయతీల సర్పంచ్ లు, ఎంపీటీసీలు...వైసీపీ వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు.  బొత్స అనుచరులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా...వలసలు మాత్రం ఆపలేకపోతున్నారు. కోట్ల సుగుణాకరరావుకు జిల్లా వ్యాప్తంగా బంధుత్వాలు, విస్తృత పరిచయాలు ఉన్నాయి. సుగుణాకరరావు బాటలోనే మరికొందరు నేతలు పయనించే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణకు చీపురుపల్లి నియోజకవర్గం పెట్టని కోట.  ప్రస్తుతం జగన్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు మున్సిపల్ మంత్రిగా పని చేశారు. బొత్స సత్యనారాయణ ...బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1999లో ఎంపీగా గెలుపొందారు. 2004 నుంచి 2019 వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే...2014లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో  భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, రవాణా, మార్కెటింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో మూడు సార్లు గెలిచిన ఏకైక రాజకీయ నేత. రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ఎదిగారు. విజయనగరం జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ నియోజకవర్గాల్లో గెలుపొందాలన్న...బొత్స సత్యనారాయణ సపోర్టు తీసుకోవాల్సిందే. అంతలా విజయనగరం జిల్లాపై పట్టుబిగించారు.

Related Posts