హైదరాబాద్
తమను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ సర్వీస్ రిమూవడ్ హోంగార్డులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి శనివారం ఉదయం సీం నివాసం వద్దకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తమ ఉన్నామని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు తమ సమస్యలు చెబుదామని ఎన్నిసార్లు విన్నవించినా, పట్టించుకోలేదని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నీ ప్రజావాణిలో కలిసి తమ సమస్యలు వివరించామని ఆయన సానుకూలంగా స్పందించారని మరోసారి రేవంత్ రెడ్డి కలవడానికి వచ్చినట్లు వారన్నారు.