హైదరాబాద్
కవిత మాటలు చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. సోమవారం నాడు అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఫూలే జయంతి, వర్ధంతి లకు కేసీఆర్ ఏనాడూ రాలేదు. కుల గణన చేసా అని కేసీఆర్ అన్నారు. కానీ బయట పెట్టకుండా తొక్కి పెట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసేది కాంగ్రెస్. కులగణన చేస్తామని రేవంత్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఐఐటి, ఐఐఎం లలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీసీ పాట పాడుతున్నారు. రాహుల్ బీసీల కోసం మాట్లాడిన తర్వాతే మిగతావాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేసిన గొప్ప పనులన్నీ ప్రచారం చేయాలని అన్నారు.