ఖమ్మం
గురువారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. సిపిఐ పార్టీ కార్యాలయానికి మర్యాదపూర్వకంగా వెళ్లి ఆ పార్టీ నాయకులను కార్యకర్తలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సిపిఐ కార్యాలయంలో పొంగులేటి మాట్లాడుతూ నా విజయానికి కృషి చేసిన కామ్రేడ్ మిత్రులకు ఎప్పుడు కృతజ్ఞతగా వుంటానని అన్నారు.
గత ఎన్నికలలో మీరు పొత్తులో భాగంగా ఒక్కసీటే తీసుకున్న, మంచి మనస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు. గత ఎన్నికలలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారో అదేవిధంగా మనం కలిసి రాబోయే పార్లమెంట్ ఎనికల్లో కూడా కలిసి పని చేయాలి ఆని కోరుకుంటున్న. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన కామ్రేడ్ సోదరులకు ముఖ్యంగా పాలేరు, ఖమ్మం, రాష్ట్ర సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవచేసే మీరు , ప్రజలకోసం పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే మార్గంలో పని చేద్దం. మీ ప్రేమ ,అభిమానం ఎలా నాకు పంచారో అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలలో అదే ప్రేమ అభిమానం మేరకు మీ శ్రీనన్న గా మీకు ఆందిస్తానని అన్నారు.