YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రమణయ్య హత్యను ఖండించిన ఉద్యోగుల సంఘం

రమణయ్య హత్యను ఖండించిన ఉద్యోగుల సంఘం

విజయవాడ
తహశీల్దార్ రమణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.  రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు  బొప్పరాజు, చేబ్రోలు కృష్ణ మూర్తి అన్నారు.  హత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేయాలి.  ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా హత్యకు కారకులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.  తహశీల్దార్ రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.  అధిక భూ వివాదాలు ఉన్న మండలాల తహశీల్దార్లు కు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలి. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి పైన విధి ఆటంకములు, దాడులు కు సంబంధించి, దోషులపైన చర్యలు తీసుకొనుటకు కఠినమైన చట్టం తీసుకురావాలి. రమణయ్య, తహసీల్దార్ దారుణ హత్యకు నిరసనగా ఈ రోజు 26 జిల్లాలో రెవిన్యూ ఉద్యోగులందరు నల్ల బాడ్జెస్ ధరించి నిరసన తెలియజేస్తున్నామని అన్నారు.

Related Posts