ములుగు
మేడారం మహాజాతర పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. కొండాయి గ్రామంలోని గోవిందరాజులు, నాగులమ్మ , సారలమ్మలను దర్శించుకున్నారు. దొడ్ల వద్ద జంపన్నవాగుపై కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించి అధికారులకు సూచనలు చేసారు. మంత్రి మాట్లడుతూ గత సంవత్సరం వరదలకి గోవిందరాజులు, సారలమ్మ, నాగులమ్మ ఆలయ ప్రాంతాలు కొట్టుకుపోయాయని అన్నారు. జాతర ప్రాంగణం, వివిధ మరమ్మత్తులకు బడ్జెట్ రిలీజ్ చేశాము. జాతర పనుల బిల్లులు ఇవ్వడంలో గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. పాత బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు ప్రస్తుత జాతర పనులను ఆపితే ఊరుకునేది లేదు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసారు. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతో కొన్ని రోడ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో అన్ని రోడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని మంత్రి అన్నారు.