YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర నిధులకోసం జగన్ ఢిల్లీ ట్రిప్ సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్ర నిధులకోసం జగన్ ఢిల్లీ ట్రిప్ సజ్జల రామకృష్ణారెడ్డి

విజయవాడ
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని  ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు టీడీపీలో బలహీనత కన బడుతోంది. పొత్తుల కోసం ఎక్కడికైనా వెంపర్లాడుతారు. అందుకే బీజేపీతో పొత్తు కోసం డీల్లీకి వెళ్లొచ్చారు.  చంద్రబాబు స్క్రిప్ట్ను షర్మిల చదువుతోంది. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో వాటిని మాట్లాడిస్తున్నారు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు. అద్దె మైకులా షర్మిల ఇక్కడ విమర్శలు చేస్తున్నారు. సీఓటర్ సంస్థ 2019లో కూడా గతంలో కూడా టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చింది. దాని విస్వసనీయత ఏందో ఫలితాల తరువాత అందరికీ తెలుసు. వారి క్రెడిబిలిటీ ఏంటో వారికే తెలియాలి. మిగిలిన సర్వేలు అన్నీ మాకు అనుకూలంగా రిజల్ట్స్ ఇస్తున్నాయి. పొత్తులకు పోయి టీడీపీ  నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తోంది.  మేము చేసిన మంచిని తెలియజేసి ఒంటరిగా పోటీచేస్తున్నాం. చంద్రబాబు పాలన చూశారు.. ఇప్పుడు జగన్ పాలన చూశారు. ప్రజలకు ఎవర్ని గెలిపించుకోవాలో వారికే ఓట్లు వేసి తీర్పు ఇస్తారు. చంద్రబాబుతో బీజేపీ పొత్తుకు ప్రయత్నిస్తోందని  ఎల్లో మీడియా విచిత్రంగా రాస్తోంది. కానీ బీజేపీకి అంత అవసరం టీడీపీతో లేదు. తెలంగాణ వ్యవహారాలు మేము పట్టించుకోము. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల నుంచి వచ్చిన పార్టీ మాది. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టించింది. దాని ఫలితం కూడా ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది. జగన్ పీఎంతో పాటు  ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాజ్యసభలో పోటీ చేయడానికి వారికి అర్హత లేదు.. వాళ్లు పోటీ చేయడం అనైతికం. వారికి సరైన సంఖ్యా బలం లేదు.  ఎల్లో మీడియాలో లేనిపోనివి రాసి కొన్ని రోజులు ఆనందం పొందుతారు అంతేనని అన్నారు.

Related Posts