హైదరాబాద్
శుక్రవారం నాడు శాసనమండలి ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నల్ల కండూవాలతో వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ అడ్డుకున్నారు. నల్ల కండువాలు వేసుకొని రావడానికి వీలులేదని నిలువరించారు. నిరసన తెలపడం మా హక్కు..కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు సభలోకి వెళ్లారు.