బాలీవుడ్ లో ప్రముఖ వ్యాపారవేత్త విజయ మాల్యా జీవిత కథను బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు మాజీ సెన్సార్ బోర్డు చీఫ్ , దర్శకుడు పహ్లజ్ నిహ్లానీ. ఈ విషయాన్ని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం లో మాల్యా పాత్రలో బాలీవుడ్ నటుడు గోవింద్ నటిస్తున్నాడు. గతంలో నిహ్లానీ..గోవిందతో ‘రంగీలా రాజా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ చిత్రంలో గోవింద గెటప్ చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతారని తెలిపారు.