YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పల్లెకు పోదాం కార్యక్రమంలో బీజేపీ నేతలు

పల్లెకు పోదాం కార్యక్రమంలో బీజేపీ నేతలు

అమరావతి
బిజెపిని సంస్థా గతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అందులో అంతర్భాగంగా  గాంవ్ ఛలో అభియాన్  పేరుతో దేశంలో ఉన్న ఏడున్నర  లక్షల పల్లెల్లో పర్యటిస్తాం. రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా,  రాజకీయంగా కూడా బిజెపి అనేక  కార్యక్రమాలు చేపడుతుంది. రెండు మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో ఎపిలో ప్రతి పల్లె ను మా వాళ్లు సందర్శిస్తారు. పల్లెకు పోదాం లో భాగంగా ఎపిలో  ఉన్న 21 వేల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుండి 24 గంటల పాటు అక్కడ బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉంటారు.  అక్కడ స్థితిగతులు తెలుసుకుంటూ అక్కడ పరిస్థితులను అంచనా వేస్తారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తారు. ఈ అంశాలన్నిటిని జాతీయ నాయకత్వానికి నివేదిక రూపంలో ఇస్తామని అన్నారు. బిజెపి నాయకులు , కార్యకర్తలు అందరూ  గ్రామాలకు వెళ్తున్నారు. వారందరికీ కూడా నా అభినందనలు. పల్లె ప్రజల పాట్లు తెలుసుకుని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని నా విజ్ఞప్తి అని అన్నారు.

Related Posts