YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం

బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం

హైదరాబాద్, ఫిబ్రవరి9
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలను తీసేసిందని.. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆయన అసెంబ్లీలో ప్రతిపాదించగా.. దీన్ని మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  బలపరిచారు. ఈ సందర్భంగా వేముల వీరేశం బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతాం. బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ నాకు తెలుసు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని చూసి బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు.?' అని ఆయన నిలదీశారు.

Related Posts