YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి సంజయ్ ప్రజాహిత యాత్ర షూరూ

బండి సంజయ్ ప్రజాహిత యాత్ర షూరూ

కరీంనగర్
బిజెపి నేత ఎంపీ  బండి సంజయ్ శనివారం నాడు ప్రజాహిత యాత్ర చేపట్టారు. పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామగ్రామాన పాదయాత్ర చేయనున్నారు. మేడిపల్లి నుంచి మొదలైన యాత్ర తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో  కొనసాగునుంది. మలివిడత ఈనెల 21 నుంచి యాత్ర రూట్ మ్యాప్ ఖరారు అయింది. మూడోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం..మోదీ ప్రధాని కావడమే లక్ష్యంగా యాత్ర కొనసాగనుంది. ఎంపీగా ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అయన ప్రజలకు  వివరిస్తున్నారు.  తొలివిడతలో ఈనెల 15 వరకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పాదయాత్రతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. అసెంబ్లీ వేదికగా జలాల గొడవపై, కాళేశ్వరం ప్రాజెక్టును విపక్షాలతో సీఎం సందర్శించే విషయంపై మాట్లాడేందుకు సంజయ్ నిరాకరించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం మూడోసారి మోదీ ప్రధాని కావడమే లక్ష్యంగా యాత్ర చేస్తున్నట్లు సంజయ్ స్పష్టం చేసారు.

Related Posts