కుత్బుల్లాపూర్.
మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. గత కొద్ది రోజులుగా నాణ్యత లేని ఆహారం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారనీ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేసారు. కళాశాల ఇంచార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎన్ఎస్యూఐ కార్యకర్తలు,విద్యార్థులు రోడ్డుపై కూర్చున్నారు. దాంతో రోడ్డు కు ఇరు వైపులా వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది.