YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది?

మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది?

-మంత్రులు, ఇంజనీర్లు కాళేశ్వరం ఎప్పుడో వెళ్లి నివేదిక ఇచ్చారు కదా?
-కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?
-క్రిష్ణా నీటి పేరుతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నయ్
-ముక్కు నేలకు రాసి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి
-కోనరావుపేట ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
కరీంనగర్,
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు హెలికాప్టర్ లో కాళేశ్వరం వెళ్లొచ్చారని,ఇంజనీరింగ్ నిపుణుల బ్రుందం వెళ్లి విచారణ జరిపి నివేదిక కూడా ఇచ్చిందని, కేంద్ర బ్రుందం కూడా ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇచ్చింది కదా మళ్లీ సీఎం సహా మంత్రులంతా వెళ్లాల్సిన అవసరం ఏముందని, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, క్రిష్ణా నీటిపై నల్గొండలో సభ పేరుతో బీఆర్ఎస్ నాటకాలాడుతున్నయని,  విలువైన అసెంబ్లీ సమయాన్ని వ్రుధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశాయ్ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
 కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేశానని ముక్కు నేలకు రాసి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అట్లాగే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ కోరాలన్నారు.
ప్రజాహిత యాత్రలో భాగంగా 4వ రోజు మధ్యాహ్నం కోనరావుపేట మండల కేంద్రానికి వచ్చిన బండి సంజయ్ కు స్థానిక ప్రజలు పూలు చల్లి, హారతిపట్టి ఘన స్వాగతం పలికారు. ఊహించని రీతిలో వేలాది మంది ప్రజలు బండి సంజయ్ ను చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బండి సంజయ్ స్థానికులను ఉద్దేశించి ప్రసగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై నిప్పులు చెరిగారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డ్రామాలను ఎండగట్టారు.
మీకోసం బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశారని దేశమంతా చర్చ జరుగుతోంది. మోదీ ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు తెలంగాణకు ఇస్తే.. కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూం కట్టియ్యలే. మీ కోసం 16 వందల కిలోమీటర్లు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసిన. త్యాగాలు మేం చేస్తే భోగాలు కాంగ్రెస్ అనుభవిస్తోందని అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రైతులకు రుణమాఫీ రూ.2లక్షలు, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు బంధు ఇయ్యలే. 6 గ్యారంటీలకు దిక్కులేదు. మీరు ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ చేసిన మేలు ఏంది అని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం భారీ ఎత్తున నిధులిచ్చింది. ఒక్క వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి రూ.575 కోట్ల 91 లక్షల రూపాయలిచ్చింది.  ఈ ఒక్క మండలానికి ఉపాధి హామీ కింద రూ.48 కోట్ల 25 లక్షలిచ్చింది. రోడ్ల మెటీరీయల్ కోసం 23 కోట్ల 25 లక్షలు, మొక్కల పెంపకానికి 33 కోట్ల 91 లక్షలిచ్చింది. ఆ నిధులేమైనయని అడిగితే వర్షాలకు మొక్కలు కొట్టుకుపోయాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నరు. మీరే ఆలోచించండి. ఇతర పనుల కోసం రూ.19 కోట్ల 52 లక్షలు, చెత్త సేకరణ కోసం రూ.16 లక్షలు, టాయిలెట్ల కోసం 2 కోట్లకుపైగా, కిసాన్ సమ్మాన్ నిధి రోడ్ల కోసం రూ.3 కోట్లు ఇచ్చినం.
కొనరావుపేట గ్రామానికి రూ.9 కోట్లకుపైగా నిధులిచ్చినం. బండి సంజయ్ చెప్పింది తప్పయితే నాపై కేసు  పెట్టండి. అట్లాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను మీరేమిచ్చారని నిలదీయండి… మేం ఇన్ని పనులు చేస్తుంటే.. ఇన్ని నిధులు ఇస్తుంటే బీజేపీకి ఓటేయకపోవడం ఎంత బాధాకరం.
అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు కాళేశ్వరం మీద డ్రామాలాడుతోంది. బీఆర్ఎస్ నేతలు క్రిష్నా నీటి నాటకాలాడుతున్నరు. అసెంబ్లీలో నిమిషానికి రూ.20వేలు ఖర్చవుతుంది. ఈ లెక్కన సభ నిర్వహణ కోసం కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ప్రజా సమస్యలను, వాళ్లకిచ్చిన హామీలను గాలికొదిలేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరి ముఖాలు ఒకరు టీవీల్లో కన్పించేందుకు పోటీలు పడి డ్రామాలాడుతున్నరు. ఒకరికొకరు తిట్టుకుంటరు తప్ప వాటిపై చర్యలుండవన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోరు.
10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఆస్తులు పెరిగినయే తప్ప.. ప్రజల ఆస్తులు పెరిగినయా?  బీఆర్ఎస్ నేతలు గుడిని మింగితే.. కాంగ్రెసోళ్లు గుడి లింగాన్ని కూడా మింగేస్తరు అని అన్నారు.
కాళేశ్వరం వల్ల రూ.లక్ష కోట్ల ప్రజాధనం వ్రుధా అయ్యింది, అధికారంలోకి వస్తే సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ పని చేయడం లేదు? సిట్టింగ్ జడ్డితో విచారణకు సీజే అంగీకరించలేదు కాబట్టి తక్షణమే సీబీఐ విచారణ కోరి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

Related Posts