YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ యాత్రలో సినీ గ్లామర్

జగన్ యాత్రలో సినీ గ్లామర్
వైసీపీలో గ్లామర్ డోస్ పెంచుతున్నారు ఆపార్టీ నేతలు. సినీ రంగ ప్రముఖులను తీసుకువచ్చే పని చేస్తోంది వైసీపీ. మొన్న ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి జగన్ తో కలిసి పాదయాత్ర చేసి మద్దతు తెలిపారు. జగన్ ని ఆకాశానికి ఎత్తారు. అధికార ప్రభుత్వంపై పలు విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఆయనకు తోడుగా వచ్చారు మరో నటుడు పృధ్వీరాజ్. ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సాగుతోంది. పాదయాత్రలో ఉన్న జగన్‌ను సినీ నటుడు పృథ్వీరాజ్ కలిసి మద్దతు తెలిపారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరం వద్ద జగన్‌ను కలిసిన పృథ్వీరాజ్ జగన్‌తో ముచ్చటిస్తూనే.. చేతిలో చేయి వేసి వైసీపీ జెండా భుజానికెత్తుకోవడం విశేషం.అసలు సంగతి ఏంటంటే అటు పోసాని..ఇటు పృథ్వీ లు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అందుకే ఆయన్ను కలిశారని తెలుస్తోంది. వారే కాదు…సినీ నటులను తిరిగి వైకాపా గూటికి చేర్చే పని చేస్తున్నారు అంబటి రాంబాబు. రోజా నటి మరియు ఎమ్మెల్యే అయినప్పటికీ కాస్తంత దూకుడు తగ్గించింది. ఇప్పుడు మరో నటుడుని తెరపైకి తెచ్చే ప్రయత్నం సాగుతోంది. మోహన్ బాబును తీసుకువచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.టీడీపీలో మురళీ మోహన్, వేణుమాధవ్ లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కవిత లాంటి వారు పార్టీ మారినా..టీడీపీలో ఉన్న నందమూరి హీరోలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీలో కృష్ణంరాజు లాంటి వారు ఉన్న సంగతి తెలియంది కాదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ రంగ ప్రముఖుడే. ఇక కాంగ్రెస్ లో ఉన్న చిరంజీవి ఇప్పుడు క్రియాశీలకం కాకపోయినా సినీ రంగంలో ఉన్న వారే.

Related Posts