ఖమ్మం
శుక్రవారం నాడు సార్వత్రిక గ్రామీణ బంద్ కు బీజేపీయేతర పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, రైతు, కూలీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్ శక్తు లకు దేశాన్ని పెడుతోందని ఆరోపిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్, సీపీఎం,సీపీఐ,ప్రజా పంథా, ఎన్టీ,బీఆర్ఎస్ పార్టీల కార్మిక, రైతు సంఘాలు గ్రామీణ బంద్ కు పిలుపునిచ్చాయి. గత నెల రోజులుగా బంద్ పై ప్రజలు,కార్మికులు,రైతులకు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మేధావులతో సెమినార్లు ర్యాలీలు,సభలు,సమావేశాలు ఏర్పాటు చేసారు. రాజకీయ పార్టీలతో పాటుగా ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ విద్యార్థి సంఘాలు సైతం గ్రామీణ బంద్ కు మద్దతు ప్రకటించాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణబంద్ ను విజయవంతానికి కార్యాచరణ రూపోందించారు.