పెద్దపల్లి
: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ గ్రౌండ్స్ లో సమ్మక్క సారళమ్మ మేడారం జాతరకు వెళ్ళే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం మేడారం జాతరకు వెళ్ళే భక్తుల రవాణా అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ మన పెద్దపల్లి నుండి 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతుందని అన్నారు. . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మేడారం జాతరకు కూడా వర్తిస్తుందని.... ఆడపడుచులందరూ ఉచితంగా మేడారం జాతరకు వెళ్లి ఆ సమ్మక్క సారలమ్మ దీవెనలను స్వీకరించాలని తెలిపారు. ... ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పెద్దపల్లి ఐటిఐ గ్రౌండ్స్ లో అన్ని వసతులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యత వహించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు