YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హెలికాఫ్టర్లలలో డబ్బుల పంపిణీనా

హెలికాఫ్టర్లలలో డబ్బుల పంపిణీనా

విజయవాడ, ఫిబ్రవరి 24
సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్ల సిద్ధం చేసింది. ఒకటి విజయవాడలో, మరొకటి విశాఖలో ఉంచాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ ధనంలో రాజకీయ ప్రచారం చేస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పర్యటనల కోసం ప్రభుత్వ ఖర్చుతో రెండు హెలికాప్టర్లను ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ సిద్ధం చేస్తోంది. ఒకటి విజయవాడలో, మరొకటి విశాఖలో అందుబాటులో ఉండేలా నిర్ణయించింది. అయితే ఇవి సొంతంగా ఏర్పాటు చేయడం కాకుండా.. అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించడం విశేషం. అయితే ట్విన్ ఇంజన్లు కావడంతో.. ఒక్కో హెలిక్యాప్టర్ అద్దె రూ.1.91 కోట్లుగా నిర్ణయించారు. గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నారు. కేవలం అద్దే కాకుండా అదనంగా ఎయిర్ పోర్ట్ హ్యాండ్లింగ్, పైలెట్లు, సిబ్బంది, ఇంధన వ్యయం సైతం ప్రభుత్వమే భరించనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన అక్షరాల నాలుగు కోట్ల రూపాయలకు పైగా నెలకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం విశేషం.ప్రస్తుతం సీఎం పర్యటన కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాత బడిందట. సీఎం ప్రయాణానికి అనువుగా లేదట. అందుకే సీఎం పర్యటనతో పాటు వివిఐపి ల టూర్లకు సంబంధించి రెండు హెలికాప్టర్లను లీజుకు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికల అందాయట. ఈ రెండింటిలో ఒకటి విజయ వాడలో, మరొకటి విశాఖలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనిపై విమర్శలు వస్తాయనో.. మరి ఏ ఇతర కారణాలు తెలియదు కానీ.. సీఎం జగన్ భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. సీఎం జగన్ కు జడ్ క్యాటగిరి భద్రత కల్పిస్తున్నందున.. వివిధ అంశాలను సున్నితంగా పరిశీలించాలంటూ ఇంటలిజెన్స్ బిజెపి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇంటలిజెన్స్ డిజి, ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం ప్రయాణాలకు అత్యధిక రెండు హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధనంలో రెండు హెలికాప్టర్లు ఏర్పాటు చేశారని, ఈ విషయంపై గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారని ఎంపీ రఘురామ సీఈసీకితెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖర్చుతో ఇలా హెలికాప్టర్ల ఏర్పాటు చేయడంపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. రెండు హెలికాప్టర్లకు నెలకు రూ.3.82 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని ఎంపీ రఘురామకృష్ణ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎన్నికల ఖర్చు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ హెలికాప్టర్ డ్రామాలాడుతుందని రఘురామ విమర్శించారు. వ్యక్తిగత భద్రత కారణాలుగా చూపుతూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు హెలికాప్టర్లలో భారీగా నగదును తరలించేలా జగన్ యత్నించే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలని రఘురామ కోరారు. హెలికాప్టర్లను కూడా తనిఖీలు చేసేలా అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.హెలికాప్టర్ల వ్యవహారంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజాధనంతో సీఎం జగన్‌ హెలికాప్టర్ ఎలా సమకూర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగిపోయే ముందు జగన్‌ ఖజానా ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం ప్రజా ధనం ఎలా వాడతారని ప్రశ్నించారు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం 2 హెలికాప్టర్లను లీజుకు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. లీజు ప్రాతిపదికన గ్లోబర్ వెక్ట్రా సంస్థ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. కొత్తగా అద్దెకు తీసుకున్న హెలికాప్టర్లను విజయవాడ, విశాఖలో ఉంచాలని నిర్ణయించారు. 2 ఇంజిన్లు కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లు లీజుకు తీసుకోనున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో హెలికాప్టర్‌కు నెలకు రూ.1.91 కోట్లు లీజు చెల్లించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వానికి ప్రతిపాదించడంతో కొత్త వాటిని సమకూర్చుకోవాలని నిర్ణయించారు. మరోవైపు సీఎం జగన్‌కు సంఘవిద్రోహుల నుంచి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ డీజీ నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్‌కు జడ్ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున, ముప్పుపై ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో కొత్త హెలికాఫ్టర్లను సమకూర్చుకుంటున్నారు. కొత్తగా సమకూర్చుకునే హెలికాఫ్టర్లను ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి విశాఖపట్నం విమానాశ్రయంలో అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ 2010 నుంచి వినియోగంలో ఉన్నందున దానిని మార్చాలని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ప్రతిపాదించింది.

Related Posts