విశాఖజిల్లా రావికమతం మండలం రెవిన్యూ ఆఫీసులో లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసిల్దార్ జి .భాస్కర్ రావు మెగా కంప్యూటర్ సెంటర్ ప్రసాద్ సహాయంతో 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన రైతు గుర్రపు శ్రీను కు తన తండ్రి ద్వారా సంక్రమించిన 7.9 ఎకరాల భూమి దొండపూడి గ్రామంలో వుంది. శ్రీనివాసు కు మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు ఈ భూమిని సమానంగా పంచుకున్నారు . పాసుబుక్ నిమిత్తం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. పాస్ బుక్ ఇవ్వడంకోసం యాభై వేల రూపాయల లంచం రావిమతం డిప్యూటీ తహసిల్దార్ భాస్కరరావు డిమాండ్ చేసారు. ఎట్టకేలకు 4లక్షల యాభై వేలకి ఒప్పందం కుదిరింది. శ్రీనివాసరావు, అతని సోదరులు ఎసిబిని ఆశ్రయించారు. ముందస్తుగా 50 వేల రూపాయలను మెగా కంప్యూటర్ సెంటర్ అధినేత ప్రసాద్ కు ఇవ్వమని డిటి భాస్కరరావు చెప్పారు. ఏసీబీ అధికారుల సూచనమేరకు 50000 రూపాయలు తెచ్చి కంప్యూటర్ ప్రసాద్ కుఇచ్చారు. ఈలోపు ఏసిబి వాళ్ళు దాడులకు సిద్దంగా ఉన్నారు డిప్యూటీ తహసీల్దార్ భాస్కరరావు వచ్చి 50000 తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.