YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డ్రగ్స్ కేసులో బీజేపీ నేత కుమారుడు

డ్రగ్స్ కేసులో బీజేపీ నేత కుమారుడు

హైదరాబాద్, ఫిబ్రవరి 26
హైదరాబాద్ పోలీసులు నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో ఆదివారం రాత్రి ఓ బీజేపీ నేత కుమారుడు కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి.. హోటల్ లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సదరు బీజేపీ నేత కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో పట్టుబడిన వారిలో మాజీ సీఎం రోశయ్య మనవడు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో విచారిస్తున్నారు డ్రగ్స్ ప్రస్తుతం నగర వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఓవైపు డ్రగ్స్ కుదరకపోతే గంజాయి. ఇలా ఏదో ఒక రూపంలో మాదక ద్రవ్యాలు రోజు పట్టుబడుతూనే ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఒక స్టార్ హోటల్లో పార్టీ చేసుకునేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కోకైన్ సేవిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వీరిలో ఒకరిని భారతీయ జనతా పార్టీ నేత, వ్యాపారవేత్త కుమారుడు యోగానంద కుమారుడు వివేకానందగా  గుర్తించారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.వీరు ఈ కొకైన్‌ను ఎక్కడి నుండి తెప్పించుకున్నారు. ఎవరు ఇచ్చారు. ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో ఓ హీరో ప్రియురాలి వద్ద నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాజాగా ఓ రాజకీయ కుమారుడు నుంచి కోకైన్ స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. మరోవైపు ఇటీవల యూట్యూబర్ షణ్ముఖ జస్వంత్ గంజాయి సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. ఈ విధంగా నగరంలో ఏదో ఒక మూలన పబ్స్, రెస్టారెంట్లు అపార్ట్‌మెంట్స్ అని తేడా లేకుండా వివిధ కారణాలతో డ్రగ్స్ కు బానిసలుగా మారారు కొందరు వ్యక్తులు

Related Posts