YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముదురుతున్న టీడీపీ వైకాపా ఘర్షణలు

ముదురుతున్న టీడీపీ వైకాపా ఘర్షణలు

జమ్మలమడుగు
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల మధ్య రోజు రోజుకూ  ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముద్దనూరు మండల కేంద్రంలో జరిగిన గొడవ మరువక ముందే ఈరోజు పెద్దముడియం మండలం కొండ సుంకేసుల గ్రామంలో వైసీపీ, టిడిపి కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. నిన్న తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి కొండ సుంకేసుల గ్రామంలో పర్యటించి కొన్ని కుటుంబాలను టిడిపిలోకి చేర్చుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో  భూపేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన కొన్ని నిధులు దారి మళ్లాయని విమర్శించడంతో సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న ఇరువురు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ చివరకు గ్రామంలోని చావిడి వద్ద ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . ఘర్షణలో గాయాలైన  వైసిపి కార్యకర్తలను ఆసుపత్రిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

Related Posts