YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరోక్క సారి ప్రధానిగా మోడీ

మరోక్క సారి ప్రధానిగా మోడీ

సికింద్రాబాద్..
అవినీతి రహిత పాలన నందించి దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిపుతున్న మోడీ మరొక్క సారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సనత్ నగర్ నియోజక వర్గం, పద్మారావు నగర్, స్వరాజ్య ప్రెస్ నుండి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర ముషీరాబాద్ చౌరస్తా, బైబిల్ హౌస్, హిల్ స్ట్రీట్, షోలా పూర్ స్వీట్ షాప్, మహంకాళి స్ట్రీట్, సన్ షైన్ హాస్పిటల్, పీజీ రోడ్డు, పాటి గడ్డ, బేగంపేట్ రైల్వే స్టేషన్ ద్వారా అమీర్ పేట్ వైపు సాగిన రోడ్ షో లో  కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బారీ ర్యాలీతో సాగిన యాత్రలో లో వివిధ కళల ప్రదర్శనతో కళాకారులు అలరించారు.  ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మరొక్క సారి మోడీని ప్రధానిగా ఆశీర్వదించాలని కోరారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ఈ ప్రభుత్వం పని చేసిందని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేయడమే కాకుండా, కాశ్మీర్ లో ఆర్టికల్ 370ను తొలగించిన ఘనత కూడా నరేంద్ర మోడీకి దక్కుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచినా ఓడినా ఈ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవలేదు, కేసిఆర్ కుటుంబం ఒడిందని గ్యారంటిలా గారడితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెల్లడించారు. కానీ ఆ గ్యారంటిలను అమలు చేసే పరిస్తితిలో లేదని, కేంద్రంలో మరింత హీన స్థితిలోకి కాంగ్రెస్ పడిపోతుందని జోస్యం చెప్పారు.

Related Posts