YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ సారి మాములుగా లేదుగా

ఈ సారి మాములుగా లేదుగా

విజయవాడ, ఫిబ్రవరి 29,
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచ‌డంతో పాటు అభ్యర్థుల విష‌యంలో శ‌ర‌వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవల ఆరు జాబితాల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు త‌మ పార్టీ అభ్యర్థుల‌ను ప్రక‌టించ‌గా.. చంద్రబాబు కూడా 94 మంది అభ్యర్థుల‌ను ప్రకటించారు. లోక్‌షభ నియోజకవర్గాల సీట్లను మాత్రం ప్రకటించలేదు. అంత‌ర్గత చ‌ర్చల్లో పోటీ చేసే వారికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు పార్లమెంటు సీటు విష‌యంలో నాలుగు ద‌శాబ్దాల రికార్డును చంద్రబాబు, జ‌గ‌న్ ఇద్దరూ బ్రేక్ చేయనున్నారు. ఈ సీటును రెండు పార్టీలు బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ వ‌ర్గానికి కేటాయించనున్నాయి. . వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ ఈసారి తాను పోటీ చేయ‌న‌ని ముందే చెప్పడంతో జ‌గ‌న్ బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన కారుమూరి సునీల్‌ను రంగంలోకి దింపారు. సునీల్ మంత్రి కారుమూరి నాగేశ్వర‌రావు త‌న‌యుడు కావ‌డం విశేషం. ఆయ‌న తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. ఈ పార్లమెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో యాద‌వ క‌మ్యూనిటీ ఓట్లే 1.60ల‌కు పైగా ఉన్నాయి.అందుకే వైఎస్ జగన్ ఏరికోరి యాదవ సామాజికవర్గంతో పాటు ఆర్థికంగా బలమైన నేత సునీల్ కుమార్ ను రంగంలోకి దింపారన్న టాక్ జిల్లాలో బలంగా నడుస్తుంది వైసీపీ యాదవ వ‌ర్గం నేత‌ను దింపుతుంద‌ని తెలిసిన టీడీపీ కూడా అలెర్ట్ అయ్యింది.తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఈ 40 ఏళ్లలో ఏలూరు పార్లమెంటు సీటును ఆ పార్టీ ఎప్పుడూ క‌మ్మ వ‌ర్గానికే కేటాయిస్తూ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ మంత్రి మాగంటి బాబును కాద‌ని చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం కామ‌వ‌ర‌పుకోట మండ‌లం కంఠ‌మ‌నేని వారిగూడెంకు చెందిన ప్రముఖ పారిశ్రామిక‌వేత్త గోరుముచ్చ గోపాల్ యాద‌వ్‌ను రంగంలోకి దించుతోంది. గోరుముచ్చుకు ఆర్థిక వ‌న‌రులు రెడీ చేసుకోవాల‌ని అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో ఆయ‌న ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. గోపాల్ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల్లోకి దిగుతున్నార. ఆయ‌న పూర్తిగా రాజ‌కీయాల‌కు కొత్త‌.ఏలూరు పార్లమెంటు సీటును ప్రధాన పార్టీలు బీసీల‌కు ఇదే ఫ‌స్ట్ టైం. టీడీపీ 40 ఏళ్లలో క‌మ్మ సామాజికవర్గాన్ని దాటి వెళ్ల‌లేదు. వైసీపీ రెండు ఎన్నిక‌ల్లోనూ ఓసీల‌కు ఓ సారి కాపు, మ‌రోసారి వెల‌మల‌కు సీటు ఇచ్చింది. ప్రజారాజ్యం మాత్రం 2009లో యాద‌వ వ‌ర్గానికే చెందిర కొలుసు రెడ్డయ్య యాద‌వ్ ( కొలుసు పార్థసార‌థి తండ్రి)కి ఇచ్చింది. ఇక ఇప్పుడు జ‌గ‌న్‌, చంద్రబాబు ఇద్దరూ బీసీల‌కు ఇవ్వడం.. పైగా ఇద్దరు యాద‌వులే కావ‌డంతో ఈ సారి ఏలూరు పార్లమెంటు సీటు నుంచి తొలిసారి యాద‌వ్ వ‌ర్గం నేత లోక్‌స‌భ‌లో అడుగు పెట్టబోతున్నారు. అయితే అది ఏ పార్టీ నుంచి అన్నదే చూడాలి.
హిందూపురంపై ఆసక్తి
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ టికెట్ కోసం బీజేపీలో పోటీ నెలకొంది. ఓ వైపు సుదీర్ఘకాలం బీజేపీలోనే కొనసాగుతున్న నాయకుడు, మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే స్వామిజీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీ బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం నుంచి పోటీ చేయడానికి సన్నద్ధమవుతుండటంతో.. హిందూపురం ఎంపీ సీటు ఆసక్తికరంగా మారింది.ఏపీ బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి వరకు ఎదిగిన విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం బీజేపీ ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూపురం స్థానికుడైన తాను బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నానని తెలిపారు. 30 ఏళ్లుగా బీజేపీలో ఉంటున్న తనకు ఎంపీ టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానంటున్నారు. పరిపూర్ణానంద స్వామి టికెట్ ఆశించడంలో ఎలాంటి తప్పులేదన్నారు.హిందుస్థాన్‌కు మోదీజీ.. హిందూపురానికి స్వామీజీ అంటూ పరిపూర్ణానంద స్వామి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక స్వామీజీ ఎంపీ అయితే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నారు పరిపూర్ణానంద. తనకు టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలా హిందూపురం ఎంపీ సీటు కోసం ఓ వైపు బీజేపీ నాయకుడు, మరోవైపు స్వామిజీ పోటీపడుతుండటంతో.. బీజేపీ అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది

Related Posts