YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపాలో చేరుతున్నా మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి

వైకాపాలో చేరుతున్నా మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి

కడప
నేను మీ అనుమతితో వైసిపి లో చేరడానికి సిద్దమైయ్యాను. నాలుగేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. మళ్ళీ రాజకీయాలలోకి రావాలని నా వర్గం కోరుకుంటుందని  మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డిఅన్నారు.
తన వర్గీయుల ఆత్మీయ సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడారు. నేను రాజకీయాలలోకి వచ్చిన దగ్గరనుంచి 2020 వరకు టిడిపి కి ఎనలేని కృషి చేశా. టిడిపి నా కుటుంబం అనుకున్నా.. కాని నాలుగేళ్ళ రాజకీయాలకు దూరంగా ఉన్న నన్ను పట్టించుకోలేదు. నేను నమ్మిన నాయకుడు , ఆయన కుమారుడు నన్ను కొందరితో లాలూచి పడ్డానని అవమానించారు. ప్రాణమైనా ఇవ్వడానికి సిద్దపడ్డ నన్ను వైయస్ కుటుంబంతో లాలూచి పడ్డానని అన్నారు. ఇంత అవమానించిన తరువాత ఆపార్టీలో ఉండటం సరికాదనే ఆరోజు రాజీమామా చేశాను. నాకోసం నాతో టిడిపిలో కలిసి తిరిగిన పెద్ద నేతలు చంద్రబాబును అడిగినా ఆయన పట్టించుకోలేదు. కాని నాలుగురోజుల నుంచి పరిస్దితులు మారాయి.సియం జగన్ తనవారిని నావద్దకు పంపంచి నన్ను ఆహ్వానించడం ఎంతో ఆనందంగా అనిపించింది. నేను ఎవరితో పోరాడానో వారు నాకు స్నేహ హస్తం ఇచ్చారు. నేను ఎరికోసమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్దపడ్డానో ఆయన నన్ను పట్టించుకోలేదు. సియం తన వారిని పంపింన తరువాత టిడిపి వారు వచ్చారు. నాలుగేళ్ళుగా నేను టిడిపి వారికి కనబడలేదు. ఇప్పుడు మీరే చెప్పండి నేను ఎవరివైపు పోవాలో. ప్రతి గ్రామంలో మన అందరి గౌరవాలు నిలబడే విధంగా వైసిపిలో చేరడానికి ముందుకు వెళదాము. రాబోయే కాలంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి గడిచిన 25 సంవత్సరాలుగా సేవ చేశానో.. అదే  స్ఫూర్తితో అదే కట్టుబాటుతో పనిచేస్తా. ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే దానికి మీ అందరి సమస్యల్లో నిర్ణయం తీసుకున్నాను.మనం ఎప్పుడు కూడా ఊహించని రకంగా ఈ  ప్రాంతం సుందరీకరణగా తయారవుతుందని అన్నారు.

Related Posts