YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హంగామాతో టీడీపీ ప్రచారం షురూ

హంగామాతో టీడీపీ ప్రచారం షురూ

కళ్యాణదుర్గం
టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు భారీ హంగామాతో తన ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఆయన తొలిసారి పట్టణానికి వచ్చారు. అనంతపురం నుంచి వందలాది వాహనాలతో బయలుదేరి కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించారు. సురేంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పట్టణానికి చేరుకున్నారు. టీ సర్కిల్లో బాణసంచా పేల్చి ఆయనను స్వాగతించారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ, కళ్యాణదుర్గం టీడీపీకి కంచుకోట అని, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీడిపల్లి, కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 114 చెరువులకు నీరు ఇచ్చే కలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.

Related Posts