YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుపతిలో బ్యాంకు సమ్మె

తిరుపతిలో బ్యాంకు సమ్మె
దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. వేతన సవరణతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఎస్బీఐ  బ్యాంకు వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులలో బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. రేపు కూడా బ్యాంకు ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.
బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నామని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా జరిపిన చర్యలు విఫలం కావడంతో సమ్మెకు దిగినట్లు బ్యాంకు సంఘాలు వివరించాయి. తమ పోరాటానికి ఖాతాదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. 

Related Posts