సెల్ఫీ కోసం ప్రయత్నం చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నడో యువకుడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా వుంటున్న పగడలరామసాయి ఇటీవలే పదవ తరగతి పూర్తిచేసాడు. బుధవారం నాడు సెల్ఫీ కోసం రైల్వే గూడ్స్ ఎక్కాడు. ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. రామసాయి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించారు.