YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేర్చిన ఘనత సీఎం జగనన్నదే

సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేర్చిన ఘనత సీఎం జగనన్నదే

ఎమ్మిగనూరు
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వకర్త  బుట్టా రేణుక  ఎమ్మిగనూరు పట్టణంలో 6వ వార్డు అబ్బాస్ టాకీస్ ఆంజనేయ స్వామి దేవాలయం నందు  స్వామి వారిని ప్రత్యేక దర్శనం చేసుకొని అనంతరం వార్డు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టన్నారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు.నాయకులు  కార్యకర్తలతో కలిసి ప్రతి కార్యకర్తను కలుస్తూ పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలకున్న సమస్యలు వింటూ హామీలు ఇస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా నేనున్నాను అంటూ చెప్పడం జరిగింది.
రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు లో వైసీపీ జెండా రెపరేపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో  నాయకులు బుట్టా శివనీలకంఠ,  బుట్టా ప్రతూల్,   6వ వార్డు కౌన్సిలర్ శివ ప్రసాద్, , పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వార్డుసభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు. తదితరులు పాల్గొన్నారు.

Related Posts