వికారాబాద్
వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ఎలాంటి చార్జీలు లేకుండా ప్లాట్ల క్రమభద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తు వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ చౌరస్తా లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎల్ ఆర్ ఎస్ ను పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నరని కోర్టలో కేసులు కూడా వేశారు మరి ఇప్పుడు మి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పడైనా ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేయలని వికారాబాద్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.