హైదరాబాద్
ఎన్డీఎస్యే బృందం నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్డీఎస్ఎ నాలుగు నెలల్లో రిపోర్టు సమర్పిస్తామని తెలిపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతకన్నా ముందే ప్రాథమిక రిపోర్ట్ వీలైనంత తొందరలో ఇవ్వాలని కోరాం. దాని ఆధారంగా వెంటనే డ్యాం రిపేర్ తో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు చేపడుతాం. కాలేశ్వరం ప్రాజెక్ట్ బిఆర్ఎస్ కు ఏటీఎం గా మారటానికి ప్రధాన కారణమే మోదీ ప్రభుత్వం. కార్పొరేషన్ల ద్వారా 84 వేల కోట్ల రుణం అందించింది కేంద్ర సహకారం తో తీసుకుంది. మమ్మల్ని విమర్శించే అర్హత బిజెపికి లేదని అన్నారు.