మేడ్చల్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పురపాలక పరిధిలోని దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల కి చెందిన శాశ్వత భవనాలనుఅధికారులు కూల్చివేసారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇంక్లీవ్ ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు జరిగాయి.
చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదు. కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ గండి మైసమ్మ మండల రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ మూడు శాఖల అధికారులు ఆధ్వర్యంలో భారీగా. కూల్చివేతలు నిర్వహించారు.విద్యార్దులు కూల్చివేతలను అడ్డు కున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మెల్యే ,మర్రి రాజశేఖరరెడ్డి తదితరులు సంఘటన స్ధలానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు