YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉసరవెల్లికి సిగ్గు తెప్పిస్తుంది

 ఉసరవెల్లికి సిగ్గు తెప్పిస్తుంది

టీడీపీ ది మహానాడు కాదు.  దగానాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు  ఏమాత్రం విలువలున్న తన తప్పులను ఒప్పుకోవాలి. ఒడిపోతారని తెలిసినప్పుడే చంద్రబాబు  ఎన్టీఆర్ పేరును వాడతారు. మహానాడు మొత్తం సినిమా సెట్టింగులలే. విలాసాల పై ఉన్న దృష్టి ... బాబుకు పాలనపై లేదని అయన ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుందంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు. అయితే దాన్ని రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ నిర్మిస్తుంది. ప్రజల్ని మోసం చేసేలా బాబు ప్రకటనలు చేస్తున్నారు. దోలేర నగర నిర్మాణానికి కేంద్రం 98 వేల కోట్లు ఇస్తోందని బాబు ప్రచారం చేస్తున్నారు. దోలేర నగరం, ఢిల్లీ ముంబై కరిడార్ లో భాగంగా కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమని అన్నారు. అది 8 ఇండస్ట్రియల్ సిటీ లో భాగం . 2011లొనే దోలేరను ప్రతిపాదించారు. కేంద్రం 2,500 కోట్లు మాత్రమే ఇస్తుంది. బీజేపీ ఒక్కరూపాయి కూడా అదనంగా కేటాయించలేదని అన్నారు. చంద్రబాబువి అన్ని భూటకపు మాటలే.దీనివల్ల కొద్దోగొప్ప ఉన్న విశ్వసనీయత చంద్రబాబు కోల్పోతారు .మా ప్రభుత్వం వచ్చాక ప్రకటించిన కరిడార్ లలో ఆంధ్ర లబ్ది పొందింది.దోలేరకి ఇచినట్లే కృష్ణపట్నం పోర్ట్ కి కేంద్రం నిధులు ఇస్తుంది. దోలేర లాంటి సిటీ లు ఆంధ్ర కు 3 వస్తున్నాయి . ఈ సిటీలవల్ల కొత్తగా ఉద్యోగాలు వస్తాయి .బాబు ప్రవర్తన  ఊసరవెల్లి కి కూడా సిగ్గు  తెప్పించేలా ఉందని అయన విమర్శించారు.

Related Posts