YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ లో మామ, అల్లుళ్లు

 కాంగ్రెస్ లో మామ, అల్లుళ్లు

హైదరాబాద్, మార్చి 9
మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థల బిల్డింగ్ లు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో వీటిపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు ఆధారంగా అధికారులు చర్యలు మొదలు పెట్టారు. తాజాగా భవనాల కూల్చివేతల నేపథ్యంలో మల్లారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తన కుమారుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని మల్లారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు.తాజా పరిస్థితుల నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని, ఆ ఆలోచన లేదని మల్లారెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి సిద్ధమవుతున్నారని, అందుకు సంకేతంగానే మల్లారెడ్డి అలా వ్యాఖ్యానించి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆరు ఎకరాలు కబ్జా
ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను కూల్చి వేశారు. మొత్తం 6 ఎకరాలు కబ్జా చేశారని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలో కూల్చివేతలు కొనసాగించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో మేము ఎల్ఆర్ఎస్ కు అప్లికేషన్ పెట్టుకున్నాము, అది సుప్రీంకోర్టులో ఉందన్నారు. వారం రోజుల క్రితం తమకు నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులకు తాము రిప్లయ్ ఇచ్చామని, అయినా కూల్చివేతలకు దిగడకం కరెక్ట్ కాదన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

Related Posts