YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీలో చేరికలు

బీజేపీలో చేరికలు

మేడ్చల్
మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీలకు పోటీ చేసే సత్తా లేదని   మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం మేడ్చల్ మున్సిపల్ బిజెపి పార్టీ నాయకులు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 60 మంది యువకులు ఈటెల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీలు చేరారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో లో  బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక మంది పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే పార్టీలో జాయిన్ అయి బిజెపి పార్టీని గెలిపిస్తామని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రం రెడ్డి, బిజెపి పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు, మున్సిపల్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts