హుస్నాబాద్
మంత్రి పొన్నం ప్రభాకర్ కబడ్డీ ఆడుతూ కిందపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. అక్కడున్న వారు వెంటనే ఆయనను పట్టుకుని పైకి లేపారు. తాను చిన్నప్పుడు కబడ్డీ ఎక్కువగా ఆడేవాడినని మంత్రి తెలిపారు.