YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ వినతులు స్వీకరిస్తున్నారు...

జగన్ వినతులు స్వీకరిస్తున్నారు...

ఆరు నెలలుగా ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్ నిన్న వడదెబ్బకు గురైన సంగతి తెలిసిందే. జలుబు, జ్వరం, తలనొప్పితో ఆయన బాధపడుతున్నారు. అయినప్పటికీ లెక్కచేయకుండా తన పాదయాత్రను ఆయన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం పశ్చిమగోదావరి జిల్లా కొప్పర్రు శివారులోని నైట్ క్యాంప్ నుంచి జగన్ తన 176వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగనుంది. భోజన విరామం అనంతరం చిన మామిడిపల్లి, నరసాపురం, స్టీమర్ రోడ్డు వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. జగన్ కు సలహాలు, సూచనలు ఇవ్వాలనుకునే వారు నైట్ క్యాంపుకు వెళ్లి, ఆయనను కలుసుకుని తమ లేఖలను అందజేయవచ్చు. 

Related Posts