సంగారెడ్డి
జహీరాబాద్ బీజేపీలో వర్గపోరు బయటపడింది. ఎంపీ బీబీ పాటిల్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేసారు. ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరాక జహీరాబాద్ లో ఫ్లేక్సీలు కట్టించారు. వాటిని స్థానిక బిజెపి నాయకులే చింపివేసినట్టు అనుమానం. బీజేపీలో బీబీ పాటిల్ చేరికను స్థానిక బిజెపి నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో చేరిక, ఎంపీ టికెట్ రావడం జీర్ణించుకోలేకనే ఫ్లెక్సీలు చింపారని బీబీ పాటిల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. చివరకు బీబీ పాటిల్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమైయారు.