YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పశుసంవర్ధక శాఖలో మొదలైన విజిలెన్స్ విచారణ

పశుసంవర్ధక శాఖలో మొదలైన విజిలెన్స్ విచారణ

హైదరాబాద్
పశుసంవర్ధక శాఖలో విజిలెన్స్ విచారణ మొదలయింది. గొర్రెలు, చేపలు స్కీమ్ లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖలో మంగళవారం ఫైల్స్ ను తనిఖీ చేసిన విజిలెన్స్ టీం, కీలక ఫైల్స్ మాయమైనట్టు గుర్తించింది. గొర్రెల స్కీం లో భారీగా అవినీతి జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ విచారణ అనంతరం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు.
మరోవైపు, గొర్రెల స్కాంపై ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల స్కామ్ లో మరో ఇద్దరు అధికారుల పాత్ర గుర్తించింది. కాంట్రాక్టర్ మొయిదుద్దీన్ కు సహకరించిన అధికారులను విచారిస్తున్నారు.

Related Posts