YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హామీలను అమలు చేసిన నేత జగన్

హామీలను అమలు చేసిన నేత జగన్

విజయనగరం
పేదలు పక్ష పాతి, ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సిఎం జగ న్మోహన్రెడ్డి అని వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధా ర్థ రెడ్డి అన్నారు. వైసిపి యువజన విభాగం ఆధ్వర్యంలో విజయనగరం లో యువజన భేరి ర్యాలీ, సభను నిర్వ హించారు. స్థానిక వెంకటలక్ష్మి జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ,మూడు లాంతర్లు వరకు జరిగింది. మూడు లాంతర్లు వద్ద జరిగిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడుతూ దొంగ హామీ లు ఇచ్చి అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నాడని విమర్శిం చారు. వైసిపికి అనుకూలంగా మాట్లా డిందని ఒక అమాయకురాలైన మహిళను వేధించి చంపేశారన్నారు. జగన్మోహన్రెడ్డి కనుసైగ చేస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామన్నా రు. సంక్షేమ ,అభివృద్ధి ఎంత ముఖ్యమో శత్రువులను తొక్కడం కూడా అంతే అవసరం ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన కళ్యాణ్ చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నందునే జగన్ మంచోడు కాదని అంటున్నారని అన్నారు. మోడీని ఉగ్రవాది అని , భార్యను చూసుకోలేని వాడు దేశానికి ప్రధానిగా ఏమి చేస్తాడని తిట్టిన చంద్రబాబు నేడు బిజెపితో కలిశాడన్నారు.

Related Posts