హైదరాబాద్, మార్చి 14
కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్ఫామ్స్పై నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్కి చెందిన 19 వెబ్సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాట్ఫామ్స్కి హెచ్చరికలు జారీ చేసింది. అశ్లీల కంటెంట్ని తొలగించాలని ఆదేశించింది. అయినా స్పందించకపోవడం వల్ల ఇప్పుడు వేటు వేసింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 12వ తేదీనే ఈ వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 10 యాప్స్ని వెంటనే బ్లాక్ చేయాలని తేల్చి చెప్పారు. ఇందులో గూగుల్ ప్లే స్టోర్లో 7 యాప్స్, యాప్స్టోర్లో మూడు యాప్స్ ఉన్నాయి. Information Technology Act, 2000లోని నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. సంబంధింత శాఖ అధికారులతో పాటు మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన తరవాతే ఈ నిషేధం విధించింది.