YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుంది వ్యవసాయం మా ప్రభుత్వం ప్రాధాన్యత

వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుంది వ్యవసాయం మా ప్రభుత్వం ప్రాధాన్యత

హైదరాబాద్
హైదరాబాద్ బేగంపేటలోని  ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నత అధికారులు హజరయ్యారు.
పట్టు గూళ్ల పెంపకం రైతులకు 1, 83, 41,000 రూపాయల ప్రోత్సాహక ఇన్సెంటివ్ ను మంత్రులు అందజేసారు.
భట్టి  విక్రమార్క మాట్లాడుతూ రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం హౌసింగ్ విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలి. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదని అన్నారు.
వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయండి. స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వండి. రానున్న ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇస్తాం. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. వ్యవసాయం మా ప్రభుత్వం ప్రాధాన్యత. రుణాలు ఇచ్చే విషయంలో రైతుల పట్ల నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శిస్తే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. ఫలితంగా ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న సమయంలో విద్య రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభం అయ్యాయి. 20 ఏళ్లు అయినా ఆ రుణాల జారీలో ప్రగతి కనిపించడం లేదు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి సంపదను కింది వర్గాలకు పంపిణీ చేసింది. తెలంగాణ ధనిక రాష్ట్రం బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించండి సంపదను సృష్టించండి.  రాష్ట్రంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని అన్నారు.

Related Posts