బెంగళూరు
బెంగుళూరులో కాంగ్రెస్ అగ్రనేత డి.కె.శివకుమార్ ను మాజీమంత్రి మల్లారెడ్డి,ఆయన కుమారుడు భద్రారెడ్డి కలిసారు. మల్లారెడ్డి భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుండి తన కుమారుడు భద్రారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయించాలని మల్లారెడ్డి భావించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో తన కుమారుడు పోటీపై మల్లారెడ్డి వెనక్కి తగ్గారు.