YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కూకట్ పల్లిలో ఈటల ప్రచారం

కూకట్ పల్లిలో ఈటల ప్రచారం

కూకట్ పల్లి
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కూకట్ పల్లి  నియోజకవర్గం పుట్టినిల్లు లాంటిదని అన్నారు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్. నేడు కూకట్ పల్లి నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పార్టీ కార్యాలయానికి హాజరై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నిన్న నిర్వహించిన మోడీ ర్యాలీని చూసి యావత్ తెలంగాణ అంతా ఒక్క తాటిపై నిలిచిందని స్పష్టమైనదని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బిజెపి అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి కూడా జరగబోయే ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రి కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి బిజెపి జెండా ఎగరవేస్తామని తెలిపారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుండి తమ పూర్తి మద్దతు ఉంటుందని నియోజకవర్గం ఇంఛార్జ్ కాంతారావు తెలిపారు..

Related Posts