సంగారెడ్డి
జిల్లాలో సోమవారం నుంచి పదవతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పఠాన్ చేరు నియోజకవర్గంలో 29 పరీక్ష కేంద్రాలు వున్నాయి. 6.835 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే పరీక్షలకు అరగంట ముందే లోపలికి అనుమతి వుంటుంది. పరీక్ష కేంద్రాల్లోకి అనుమతికి ఐదు నిమిషాల అదనపు సమయం అనుమతించారు.