YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం

మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేద్దాం

ఎమ్మిగనూరు
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి  బుట్టా రేణుక అన్నారు. , ఎమ్మిగనూరు పట్టణంలో 24వ వార్డు నాగప్ప కట్ట లోని స్వామి వారిని ప్రత్యేక దర్శనం చేసుకొని తరువాత  వార్డు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు.నాయకులు  కార్యకర్తలతో కలిసి ప్రతి కార్యకర్తను కలుస్తూ పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలకున్న సమస్యలు వింటూ హామీలు ఇస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా నేనున్నాను అంటూ చెప్పారు.  రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు లో వైసీపీ జెండా రెపరేపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బుట్టా శివనీలకంఠ,  రాష్ట్ర  శాప్ నెట్వర్క్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వేంకటేష్,  24వ వార్డు కౌన్సిలర్ రామంజినమ్మ, , పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వార్డు సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు. తదితరులు పాల్గొన్నారు.

Related Posts