హైదరాబాద్
ఓ వ్యక్తిని కత్తితో హత్య చేసిన సంఘటన హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగా కాలనీలోని ఓ ఇంట్లో షేక్ వాజిద్ అనే వ్యక్తిని, నిసార్ అహ్మద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న మీర్ చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటన స్థలాన్ని దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య, మీర్ చౌక్ ఏసీపీ వెంకటేశ్వర రావు పరిశలించారు. హత్యకు గల కారణాలు ఆర్థిక లావాదేవీలే అని పోలీసుల అనుమానం.