రంగా రెడ్డి
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపురి టౌన్షిప్ సర్వేనెంబర్ 112,116,125 శ్రీ గణేష్ దేవాలయం లో దేవాదాయ శాఖ భూములలో ఏర్పాటుచేసిన అక్రమ నిర్మాణాలను స్థానికుల ఫిర్యాదు మేరకు దేవాదాయ రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమ నిర్మాణాలను నేల మట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్సింగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకమారు దేవాదాయ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.